
దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం ( సెప్టెంబర్ 15) మధ్యాహ్నం ఢిల్లీ కరోల్ బాగ్ ప్రాంతంలోని గఫార్ మార్కెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పలు షాపులు తగలబడినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రజలు భయంతో పరుగులుపెట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రాణనష్టం, ఆస్తినష్టం గుర్తించలేదు.
Delhi | A fire broke out in Gaffar Market, Karol Bag. Four fire tenders have rushed to the spot. More details awaited: Delhi Fire Services
— ANI (@ANI) September 15, 2025
జూన్ 12, 2022న కూడా కరోల్ బాగ్ ప్రాంతంలో ఇలాంటి అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన తర్వాత 39 కి పైగా ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పాయి. ఫైర్ సిబ్బంది చాలా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.