రత్నదీప్ సూపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం

రత్నదీప్ సూపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న షాపింగ్ మాల్ లో మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టంగా నల్లటి పొగ వ్యాపించింది. 

దీంతో మంటలను చూసిన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఈ సమాచారాన్ని అగ్ని ప్రమాపక సిబ్బందికి అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. 

నార్సింగి సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్లు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.