స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం

స్క్రాప్ గోదాంలో  అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. శివరాంపల్లి దగ్గర ఓ స్ర్కాప్ గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలతో ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలో మంటలు ఆర్పుతున్నారు. దట్టమైన పొగలతో ఫైర్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. షార్ట్ సర్క్యూట్ తోనే అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది...