ఓల్డ్సిటీ, వెలుగు: చెట్టుపై దారానికి చిక్కుకున్న గద్దను ఫైర్ అధికారులు చాకచక్యంగా కాపాడారు. గురువారం మధ్యాహ్నం హైకోర్టు గేట్ నంబర్ 3 వద్ద ఉన్న వేపచెట్టుపై గద్ద వాలింది. అక్కడే ఉన్న పతంగులు ఎగురవేసేందుకు ఉపయోగించే దారంలో ఆ పక్షి చిక్కుకుంది. ఇది గమనించిన అగ్నిమాపక ఉద్యోగులు నర్సింగ్ యాదవ్, ఆర్.మహేశ్ రాథోడ్, కె.కొమ్రెల్లి చాకచక్యంగా చెట్టుపైకి ఎక్కి ఆ దారాన్ని తెంపేసి దానిని రక్షించారు. గద్దకు నీళ్లు తాగించి గాలిలో వదిలేశారు.
