ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మన్ ఖుర్ద్ స్క్రాప్ యార్డ్ లో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. నిన్న సాయంత్రమే ప్రమాదం జరిగినా… ఇప్పటికీ మంటలు వస్తూనే ఉన్నాయి. 19 ఫైరింజన్లతో ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 16 గంటలు కావొస్తున్నా మంటలు ఇప్పటికీ అదుపులోకి రాలేదు. అయితే అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని స్థానికులు చెబుతున్నారు. అలాగే ఎలాంటి ఆస్తి నష్టం కూడా జరగలేదు. అయితే స్క్రాప్ యార్డ్ చుట్టుపక్కల ఎక్కువగా ఆయిల్ గోడౌన్స్ ఉన్నాయి. వాడిన ఆయిల్ ను అక్కడ నిల్వ చేస్తారు. ఈ ఏరియాలో ఎక్కువగా రోజువారీ కూలీలు నివసిస్తుంటారు. మంటలు అంటుకోగానే… వారంతా అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
#WATCH I Maharashtra: Firefighting operation continues at the godowns in Mumbai's Mankhurd where a fire broke out yesterday. pic.twitter.com/ttN2qarzaI
— ANI (@ANI) February 6, 2021