అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. మిస్సోరీలోని సెయింట్ లూయీస్ నగరంలోని ప్రెవె 4000 బ్లాక్లోని ఓ ఇంట్లోకి దుండగులు చొరబడి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఘటన స్థలంలోనే మృతిచెందారు. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులంతా 20 నుంచి 30ఏళ్ల మధ్య ఉన్న నల్లజాతీయులని చెప్పారు. అయితే అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి. అయితే కాల్పులు ఎవరు జరిపారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.