
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.27.07 కోట్ల జీఎస్టీని ఎగవేసిన కేసులో బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్, బిగ్ లీప్ హెచ్ఆర్ సర్వీసెస్ సంస్థ డైరెక్టర్వినయ్ కోట్రాను అరెస్ట్ చేశామని కమర్షియల్ ట్యాక్స్కమిషనర్ టీకే శ్రీదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బేగంపేట నుంచి కార్యకలాపాలు సాగించే ఈ సంస్థలు మ్యాన్ పవర్ సప్లయర్స్ రంగంలో గత ఐదేళ్లుగా పని చేస్తున్నాయి.
ఐదేళ్లుగా తమ కార్యకలాపాల పేరుతో ప్రతి నెల జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేస్తూ కస్టమర్లు ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్రీయింబర్స్చేసుకునేలా వ్యవహరించాయి. కానీ జీఎస్టీ మాత్రం చెల్లించలేదు. మరోవైపు కస్టమర్లు ఇన్పుట్ క్రెడిట్ట్యాక్స్ తీసుకోవడంతో ప్రభుత్వానికి రెండు రకాలుగా నష్టం వాటిల్లింది. 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి 2022 – 23 ఆర్థిక సంవత్సరం వరకు రూ.27.07 కోట్ల జీఎస్టీని ఎగవేసింది.
ఈ సంస్థలు సేవలందిస్తున్న కస్టమర్ల నుంచి ట్యాక్స్ లు వసూలు చేసుకుంటూ జీఎస్టీ ఫైలింగ్లో మాత్రం ‘జీరో’ టర్నోవర్స్గా పేర్కొని అక్రమాలకు పాల్పడినట్టుగా కమర్షియల్ట్యాక్స్డిపార్ట్మెంట్గుర్తించింది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టిన ఈ సంస్థల డైరెక్టర్ను అరెస్ట్ చేసింది.