
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. షెడ్యూల్ ప్రకారం 2025, అక్టోబర్ 13వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు రిటర్నింగ్ అధికారి. షేక్ పేట్ ఎమ్మార్వో ఆఫీసులో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభం అయ్యింది. అక్టోబర్ 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 22వ తేదీన దాఖలైన నామినేషన్ పరిశీలన ఉంటుంది. 24వ తేదీ వరకు నామినేషన్ విత్ డ్రా.. ఉపసంహరణకు గడువు ఉంది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయిన రోజునే.. సోమవారం ఫస్ట్ నామినేషన్ దాఖలు అయ్యింది. సిలివేరు శ్రీకాంత్ అనే వ్యక్తి రెండు సెట్ల నామినేషన్ పత్రాల దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు సిలివేరు శ్రీకాంత్.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత ఫైనల్ అయ్యారు. బీజేపీ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గోపీనాథ్ భార్య సునీత బరిలోకి దిగుతున్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి 2025, నవంబర్ 11వ తేదీ పోలింగ్ జరగనుంది. 14వ తేదీ కౌంటింగ్.