దర్శకుడు నక్కిన త్రినాథరావు నిర్మాతగా, నిఖిల్ గొల్లమారి డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘చౌర్య పాఠం’. ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా రాజీవ్ కనకాల, మస్త్ అలీ, అంజి వల్గుమాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్, టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేశారు. డేవ్ జాంద్ కంపోజ్ చేసిన ఈ పాటకు కళ్యాణచక్రవర్తి త్రిపురనేని మనసుకి హత్తుకునే లిరిక్స్ అందించగా, శ్వేతా మోహన్, హరిచరణ్ కలిసి పాడారు.
‘తెలిసి తెలిసి దాచేస్తుంటే.. ఇదియే వరసో తెలిసేనా..’ అంటూ సాగే పాటలో ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. పల్లెటూరి విజువల్స్ చాలా ప్లజెంట్గా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని కథను అందిస్తూ, డీవోపీగా పని చేస్తున్నాడు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తామని మేకర్స్ చెప్పారు.