
ట్యాంక్ బండ్, వెలుగు: బేగంబజార్, సిద్ధి అంబర్ బజార్, ఛత్రి ప్రాంతాల్లో రోడ్డును విస్తరించాలని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విజ్ఞప్తి చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం సాయికుమార్మాట్లాడుతూ.. గోషామహల్ నియోజకవర్గంలోని బేగంబజార్, సిద్ధిఅంబర్ బజార్, ఛత్రి ప్రాంతాలు వ్యాపార కేంద్రాలుగా మారడంతో రోజూ ట్రాఫిక్సమస్యలు తలెత్తుతున్నాయని, తెలిపారు.
ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్పూర్తయితే భవిష్యత్తులో ఈ రోడ్డు మరింత రద్దీగా మారే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని రోడ్డును వెడల్పు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించారని తెలిపారు.