తాళ్ల చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోండి..కలెక్టర్ను కోరిన నాగులపల్లి మత్స్యకారులు

తాళ్ల చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోండి..కలెక్టర్ను కోరిన నాగులపల్లి మత్స్యకారులు

రామచంద్రాపురం, వెలుగు: తెల్లాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల నాగులపల్లి తాళ్ల చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని గ్రామ మత్స్యకారుల సంఘం సభ్యులు కోరారు. సోమవారం కలెక్టర్ ప్రావీణ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. తాగునీటి జల సంఘం మాజీ అధ్యక్షుడు నర్సింహులు, సంఘం ప్రెసిడెంట్ సుదర్శన్​ మాట్లాడుతూ ఈదులనాగులపల్లి గ్రామంలోని తాళ్ల చెరువు కట్టను ఆనుకొని ఇష్టానుసారం వెంచర్లు వేస్తున్నారని, అభివృద్ధి పేరుతో చెరువు ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నాలు జరుతున్నాయని ఆరోపించారు. 

చెరువు ఎఫ్టీఎల్, బఫర్​ జోన్లను ఆక్రమించి కొన్ని నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించాయని దీనివల్ల మత్స్యకారులు జీవనోపాది కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి తాళ్ల చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని  కోరారు. ఇరిగేషన్​ అధికారులు క్షేత్ర పరిశీలన చేసి చెరువు హద్దు బంధులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్​ను కలిసిన వారిలో మాజీ కౌన్సిలర్​ శంషాబాద్ రాజు, మత్స్యకారుల కో ఆపరేటివ్​ సొసైటీ సభ్యులు లక్ష్మణ్, మల్లేశ్, కృష్ణ  ఉన్నారు.