చెరువులో విష ప్రయోగంతో చేపలు మృతి

చెరువులో విష ప్రయోగంతో చేపలు మృతి

అమ్రాబాద్, వెలుగు: మండలంలోని మాచారం గ్రామ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో చేపలు చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ శివారులోని చెరువులో ఐసీఐసీఐ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేప పిల్లలు విడిచారు. గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో విషం చల్లడంతో చేపలు చనిపోయినట్లు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.