కృష్ణా నదిలో ఐదుగురు పిల్లలు గల్లంతు

కృష్ణా నదిలో ఐదుగురు పిల్లలు గల్లంతు

ఏపీ కృష్ణా జిల్లాలో మున్నేరు పరిసర ప్రాంతాల్లో ఐదుగురు పిల్లలు గల్లంతయ్యారు. అయితే ముగ్గురి మృతదేహాలు లభ్యం అయ్యాయి.  సంక్రాంతి సెలవులు కావడంతో.. చందర్లపాడు మండలం ఏలూరులో వద్ద 12 నుంచి 13 ఏళ్ల మధ్య వయసు కలిగిన ఐదుగురు పిల్లలు కృష్ణా నదిలో ఈతకు వెళ్లారు. పిల్లలు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు.. వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. మున్నేరు ఒడ్డున పిల్లల దుస్తులు, సైకిళ్లు ఉండటంతో.. గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. నదిలో ఐదుగురు మృతదేహాల్ని వెలికితీశారు.  నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున.. పిల్లలంతా గల్లంతైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు.