కారు, లారీ ఢీ కొని..అక్కడిక్కడే ఐదుగురు దుర్మరణం

కారు, లారీ ఢీ కొని..అక్కడిక్కడే  ఐదుగురు దుర్మరణం

కేరళ కోజికోడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీ కొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున రామనట్టు కర ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పాలక్కడ్ చెర్పులస్సెరి, పట్టాంబికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా కారిపూర్ ఎయిర్ పోర్టుకు వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది. మృతదేహాలను కోజికోడ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తరలించారు. బోలేరో కారు పూర్తిగా దెబ్బతింది. లారీని ఢీ కొట్టక ముందే బోలేరో వెహికిల్ మూడు పల్టీలు కొట్టిందని లారీ డ్రైవర్ చెప్పాడు. ఐతే లారీ డ్రైవర్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.