క్వెట్టాలో పేలుడు ఐదుగురు మృతి

క్వెట్టాలో పేలుడు ఐదుగురు మృతి

పాకిస్తాన్ లోని క్వెట్టాలో ఇవాళ(బుధవారం) భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఇద్దరు పోలీసులతో సహా ఐదుగురు మృతి చెందారు. 38 మంది తీవ్ర గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసు వాహనం టార్గెట్ గా చేసుకుని దుండగులు ఇవాళ ఉదయం ఈ దాడికి పాల్పడ్డారు. సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బచ్చా ఖాన్‌ చౌక్‌ దగ్గర పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (SHO) టార్గెట్ గా చేసుకుని దుండగులు ఈ దాడి చేశారన్నారు. ఆ ఆఫీసర్ గాయాలతో తప్పించుకున్నారని చెప్పారు. SHO ను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో క్వెట్టాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు పోలీసుఉన్నతాధికారులు.