తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్.. సీఎస్‌కు సీఈసీ కీలక ఆదేశం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్.. సీఎస్‌కు సీఈసీ కీలక ఆదేశం..

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది.  ఈ ఏడాది చివర్లో  తెలంగాణ, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​ఘడ్​, మిజోరాం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  ఈ క్రమంలో  ఐదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు శుక్రవారం (జూన్ 2)  కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం పోస్టులో మూడేళ్లు సర్వీస్ దాటిన ప్రభుత్వ అధికారులను బదిలీ చేయాలని సీఈసీ ఆదేశించింది.

అధికారుల బదిలీల గురించి..

కీలక స్థానాల్లో ఉన్న రెవెన్యూ, పోలీసు అధికారులను మూడేళ్లు దాటితే  బదిలీ చేయాలని సీఈసీ ఆదేశించింది. అంతేకాకుండా ఈ బదిలీల ప్రక్రియను జూలై 31లోపు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లకు సొంత జిల్లాలో పోస్టింగ్ ఇవ్వొద్దని తెలిపింది.  ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు స్థానికంగా పోటీ చేస్తోన్న అభ్యర్థులతో బంధుత్వాలు లేవని వారి నుండి డిక్లరేషన్ తీసుకోవాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.