జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్... ఐదుగురు టెర్రరిస్టులు హతం

జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్... ఐదుగురు టెర్రరిస్టులు హతం

జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో  ఆర్మీ, ఉగ్రవాదులు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్​ జోన్​ పోలీస్ అఫీషియల్​ట్వీట్ లో వెల్లడించిన వివరాల ప్రకారం.. కుప్వారా జిల్లాలో జూన్ 16 ఉదయం భారత ఆర్మీ సెర్చ్​ ఆపరేషన్​ చేస్తుండగా వారికి, ఉగ్రవాదులకు మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఎన్​కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.  సెర్చ్​ ఆపరేషన్​ ఇంకా కొనసాగుతోందని కశ్మీర్​ ఏడీజీపీ విజయ్​కుమార్​ తెలిపారు.

నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికిపై భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందడంతో ఎన్‌కౌంటర్ జరిగింది. జూన్ 13న కూడా కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపాయని పోలీసులు తెలిపారు. జూన్​2న రాజౌలీ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. బార్డర్​లో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారడంతో మరిన్ని బలగాలు మోహరించే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.