జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఆర్మీ, ఉగ్రవాదులు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్ జోన్ పోలీస్ అఫీషియల్ట్వీట్ లో వెల్లడించిన వివరాల ప్రకారం.. కుప్వారా జిల్లాలో జూన్ 16 ఉదయం భారత ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా వారికి, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని కశ్మీర్ ఏడీజీపీ విజయ్కుమార్ తెలిపారు.
నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికిపై భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందడంతో ఎన్కౌంటర్ జరిగింది. జూన్ 13న కూడా కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపాయని పోలీసులు తెలిపారు. జూన్2న రాజౌలీ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. బార్డర్లో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారడంతో మరిన్ని బలగాలు మోహరించే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.