ట్యాంక్ బండ్ వద్ద ఒకే రోజు ఐదుగురు ఆత్మహత్యాయత్నం

ట్యాంక్ బండ్ వద్ద ఒకే రోజు ఐదుగురు ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ లో ఒకే రోజు ఐదుగురు మహిళలు ఆత్మహత్యాయత్న చేయడం  కలకలం రేపుతోంది. ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ వద్ద ఇవాళ ఐదుగురు ఆత్మహత్యకు యత్నించారు. భర్త వేధింపులు తాళలేక  డిప్రెషన్ తో ఇద్దరు మహిళలు ఆత్మహత్యయత్నం చేయగా.. ఆర్థిక సమస్యలతో ఓ మహిళ ..ప్రేమ విఫలమైందని మరో యువతి ఆత్మహత్యాయత్నాకిని పాల్పడ్డారు. మద్యానికి బానిసైన ఓ మహిళ కుటుంబ సమస్యలతో ఆత్మహత్యాయత్నం చేసింది. వీరందరినీ లేక్ పోలీసులు కాపాడారు. వారికి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.