నెల్లూరు జిల్లా కావలిలో రాజకీయ పార్టీ ఫ్లెక్సీల రగడ ఉద్రిక్తంగా మారింది. రెండు రోజులుగా టీడీపీ, జనసేన ఫ్లెక్సీలను తొలగించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ ఫ్లెక్సీలు తొలగిస్తే గొంతు కోసుకుని మరణిస్తానని టీడీపీ మాజీ కౌన్సిలర్ చిన్న కిరణ్ హెచ్చరిక చేశారు. ఇప్పుడు టీడీపీ నేత మలిశెట్టి వెంకటేశ్వర్లు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. అంతేకాకుండా టీడీపీ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. . టీ దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పురపాలక సిబ్బంది టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తొలిగిస్తే అన్ని పార్టీల ప్లెక్సీలు తొలగించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. వైసీపీ ఫ్లెక్సీలని ఎందుకు తొలగించరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ALSO READ :చుట్టూ పులులు.. ఎటొచ్చి ఎప్పుడు దాడి చేస్తాయో.. కొండెక్కాలంటే వణుకుతున్న శ్రీవారి భక్తులు