మహదేవపూర్, వెలుగు : ‘వరద సాయం అందరికియ్యాలే.. టీఆర్ఎస్ పార్టీల ఉన్నోళ్లకే ఇచ్చి మాకు ఇయ్యకపోతే ఎట్లా? ’ అంటూ వరద బాధితులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్డెక్కి ధర్నా చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో గత నెల గోదావరి ఉప్పొంగి పుష్కర ఘాట్ దాటి సుమారు 800 మీటర్ల దూరం వరకు ప్రవహించింది. వరదకు 84 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. సర్వే చేసిన అధికారులు వీరికి వరద సాయం అందజేయాలని ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపారు. అయితే బుధవారం టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురికి మాత్రమే రూ.10 వేల చొప్పున వరద సాయం అందింది. ఇందులోనూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురున్నారు. దీంతో వరద సాయం అందని కుటుంబాల్లోని మహిళలు ఆగ్రహంతో రోడ్డెక్కారు. కాళేశ్వరం బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా బాధితురాలు భాగ్య మాట్లాడుతూ లిస్టులో అనర్హుల పేర్లు ఉన్నాయని, తమ లాంటి నిజమైన బాధితులకు మొండిచేయి చూపించారని ఆవేదన వ్యక్తం చేసింది. ‘నా ఇంటికి ఇటు పక్కోళ్లకు పైసలిచ్చిన్రు..అటు పక్కోళ్లకూ ఇచ్చిన్రు...నాకు మాత్రం ఇయ్యలే’ అని వాపోయింది. తమ దగ్గర వివరాలు తీసుకుని, టీఆర్ఎస్ పార్టీ లీడర్ల సంబంధీకులకు పైసలిచ్చారని ఆరోపించింది.
టీఆర్ఎస్ పార్టీ వాళ్లకే వరద సాయం ఇస్తున్రు
- వరంగల్
- August 11, 2022
లేటెస్ట్
- సుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..
- టెస్కో ద్వారా శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు : మంత్రి తుమ్మల
- Nagababu: X(ట్విట్టర్) నుండి మెగా బ్రదర్ నాగబాబు అవుట్.. కారణం ఏంటంటే?
- ఆటగాడే : స్పీచ్ థెరపీతో ముగ్గులోకి దింపి.. మూడో పెళ్లి.. బాధితురాలి ఆందోళన
- Vijay GOAT: హాలీవుడ్ రేంజ్లో విజయ్ గోట్..అవతార్,అవెంజర్స్ నిపుణుల వీఎఫ్ఎక్స్
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- IIT JEE అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల
- రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు
- Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!
- వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన