
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు టీమిండియా సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా రేపు తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా బలమైన టీంతో ఆడుతున్నామని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు. తమ శక్తిసామర్ధ్యాలను పరీక్షించుకోవడానికి ఇది మంచి అవకాశమన్నారు. అపోజిట్ టీం ఎలా ఉందో ఆలోచించకుండా.. పూర్తిగా తమ టీం ఆటతీరుపై ఫోకస్ పెడతామన్నారు. హైదరాబాద్ ప్లేయర్ సిరాజ్ రెండేళ్లుగా బాగా ఆడుతున్నాడని.. అతని గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతుందని చెప్పారు. మూడు ఫార్మట్స్లో అతను ముఖ్యమైన ప్లేయర్ అన్నారు. తొలిసారి హోం గ్రౌండ్లో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న సిరాజ్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. గత సిరీస్ ఆడని ఇషాన్ కిషన్ ఈ సారి మిడిల్ ఆర్డర్లో ఆడతాడని తెలిపారు. స్పిన్నర్లు చాహల్, అక్షర్, కుల్దిప్ అందుబాటులో ఉన్నారని.. ప్రస్తుతం తమ టీం మంచి ప్రదర్శన కనబరుస్తోందని స్పష్టం చేశారు.