ప్రధాని 7 సూచనలను పాటిద్దాం

ప్రధాని 7 సూచనలను పాటిద్దాం

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తిని అడ్డుకోవటానికి లాక్ డౌన్ ను అందరం పాటిద్దామని బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పిలుపునిచ్చారు. మహమ్మరిపై విజయం సాధించాలంటే ప్రధాని మోడీ చేసిన 7 సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు. ” లాక్ డౌన్ ను అంకితభావంతో పాటిద్దాం. ఇప్పటి వరకు అన్ని సూచనలను మనమంతా ఐక్యంగా కొనసాగించాం. కరోనాను ఓడించేందుకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదాం” అని నడ్డా ట్వీట్ చేశారు. లాక్ డౌన్ లో పేదల ఆకలిని తీర్చాలని బీజేపీ కార్యకర్తలను నడ్డా కోరారు.
థాంక్యూ సోనియా జీ… ఆరోగ్యం జాగ్రత్త
కరోనా పై పోరాటం కష్టపడుతున్న డాక్టర్లు, శానిటేషన్ ఇతర సిబ్బందిని ప్రశంసిస్తూ సోనియా పోస్ట్ చేసిన వీడియో పై నడ్డా స్పందించారు. థాంక్యూ సోనియా జీ…ఆరోగ్యం జాగ్రత్త అంటూ ట్వీట్ చేశారు. దేశ‌మంతా ఐక్యంగా ఉండాల్సిన స‌మ‌యంలో.. సోనియా రాజ‌కీయం చేస్తున్నారని గ‌తంలో న‌డ్డా ఆరోపించారు. తాజాగా సోనియా పోస్ట్ చేసిన వీడియో కు థాంక్యూ అని చెప్పటం విశేషం.