ఫుడ్​పాయిజన్ తో ఆరుగురు స్టూడెంట్స్ కి అస్వస్థత

ఫుడ్​పాయిజన్ తో ఆరుగురు స్టూడెంట్స్ కి అస్వస్థత

రామాయంపేట, వెలుగు :  మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం బీసీ హాస్టల్ లో మంగళవారం ఫుడ్ పాయిజన్​తో ఆరుగురు స్టూడెంట్స్​అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అన్నం తిన్న తరువాత  స్టూడెంట్స్​ గిరి, తరుణ్, రఘు, అశ్విన్, రాము, వశీకరణ్ తలనొప్పి, కడుపు నొప్పితో వాంతులు చేసుకున్నారు. దీంతో వార్డెన్ స్వామి వారిని స్థానిక పీహెచ్​సీకి తరలించి చికిత్స చేయించారు.

నల్ల పురుగులతో కూడిన అన్నాన్ని తినడం వల్లే  ఫుడ్ పాయిజనింగ్ అయి ఉంటుందని అస్వస్థతకు గురైన స్టూడెంట్స్​ తల్లిదండ్రులు, గ్రామస్తులు వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి జిల్లా బీసీ వెల్ఫేర్​ ఆఫీసర్​ శంకర్​ ధర్మారం హాస్టల్​ను సందర్శించారు. జరిగిన సంఘటన గురించి ఆరా తీశారు. విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని  చెప్పారు.