రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్  యూనిట్లు ఏర్పాటు చేయాలి: కేసీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్  యూనిట్లు ఏర్పాటు చేయాలి: కేసీఆర్

రాష్ట్రంలో  ఫుడ్  ప్రాసెసింగ్  యూనిట్లు  స్థాపించే  విషయంలో  ప్రభుత్వంతో  కలిసి  రావాలని  ఐటిసి లిమిటెడ్ ను  కోరారు  సీఎం  కేసీఆర్.  ఐటిసి  చైర్మన్ సంజీవ్ పురి,  ఎగ్జిక్యూటీవ్  డైరెక్టర్  నకుల్  ఆనంద్…క్యాంప్  ఆఫీస్ లో  సీఎంతో  సమావేశమయ్యారు.  ముడి  సరుకు  సేకరణ,  ఇతరత్రా  అంశాల్లో మహిళల  సేవలను  వినియోగించుకుని  రాష్ట్ర  వ్యాప్తంగా  ఫుడ్  ప్రాసెసింగ్  యూనిట్లు  ఏర్పాటు  చేయాలని  ఈ  సందర్భంగా  ఐటీసీ  మేనేజ్  మెంట్ ను కోరారు  సీఎం.  ఇక…మెదక్  జిల్లా  మనోహరాబాద్  సమీపంలో  రూ.800  కోట్ల  వ్యయంతో  ఐటిసి  చేపట్టిన  ఫుడ్  ప్రాసెసింగ్  యూనిట్  నిర్మాణ  పనులు పూర్తయ్యాయని…  రెండు  మూడు  నెలల్లో  ప్రారంభిస్తామని సీఎంకు  వివరించారు  సంజీవ్ పురి.