ఆదిలాబాద్ జిల్లాలో వలస పక్షులు ఆకట్టుకుంటున్నాయి. బోథ్ మండలం మర్లప్లలి చెరువులో విదేశాలకుచెందిన రకరకాల పక్షులు సందడి చేశాయి. వింటర్ సీజన్ లో వివిధ దేశాలనుంచి వేలకిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన భారీ హెడెడ్పక్షులకు ఆదిలాబాద్ చిత్తడి నేలలు ఆతిథ్యమిచ్చాయి. జిల్లాకు వలస పక్షుల రాక మొదలైందని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రకరకాల విదేశీ వలస పక్షులను చూసి పక్షి ప్రేమికులు మురిసిపోతున్నారు.
శీతాకాలంలో సైబీరియా, మధ్య ఆసియా వంటి ప్రాంతాలనుంచి రెడ్ క్రెస్టెడ్ పోచర్డ్, కామన్ పోచర్డ్, యూరేషియన్ టీల్, నార్తర్న్ పోవెలర్, నార్తర్న్ పిన్ టైల్ వంటి అనేక రకాల వలస పక్షులకు ఆదిలాబాద్ జిల్లాలో చెరువులు, చిత్తడి నేలలకు వలస వస్తాయి. నాలుగు నెలల పాటు ఇక్కడ బస చేయనున్నాయి. పక్షి ప్రేమికులకు, పరిశోధకులకు ఈ పక్షుల రాక ఒక అద్భుతమైన అనుభూతిని, అధ్యయనం చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది జిల్లా జీవ వైవిధ్యాన్ని పెంచుతుంది.
ప్రతియేటా వచ్చే ఈ పక్షుల సంరక్షణకు అటవీశాఖ అన్ని చర్యలు చేపడుతోంది. జిల్లాలో నాలుగుప్రాంతాలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. వలస పక్షులకు ఆతిథ్యమిచ్చే చెరువులు, చిత్తడి నేలల రక్షణకు కృషి చేస్తోంది.
