ఎడ్లబండి పోటీల్లో అపశృతి..వీడియోగ్రాఫర్పైకి దూసుకెళ్లిన ఎద్దు..తీవ్రగాయాలు

ఎడ్లబండి పోటీల్లో అపశృతి..వీడియోగ్రాఫర్పైకి దూసుకెళ్లిన ఎద్దు..తీవ్రగాయాలు

కరీంనగర్​జిల్లాలో ఎడ్లబండి పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. కోట్ల వీరభద్రస్వామి వారి వార్షికోత్సవంలో నిర్వహించిన ఎడ్లబండి పోటీల్లో ఎడ్లబండి ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం హుటాహుటిన కరీంనగర్​ ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. 

ఆదివారం (జనవరి 18) గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లిలో కోట్ల వీరభద్రస్వామి వారి వార్షికోత్సవాల్లో భాగంగా ఎడ్ల బండ్ల పోటీల్లో నిర్వహించారు.  ఈ క్రమంలో పోటీలను వీడియో తీస్తున్న ఓ వ్యక్తిపైకి  ఎడ్లబండి వేగంగా దూసుకెళ్లి ఢీకొట్టింది. ఎద్దు ఒక్కసారిగా పైకి లేచి బలంగా ఢీకొట్టడంతో  వీడియో గ్రాఫర్ కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం కరీంనగర్​ఆస్పత్రికి తరలించారు.