
హైదరాబాద్ సిటీ, వెలుగు: సూపర్ మార్కెట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. 44 సూపర్ మార్కెట్లపై దాడులు జరిపిన అధికారులు.. 58 శ్యాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపారు. చాలా స్టోర్లలో పురుగులు, దుమ్ము, కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించారు.
సైదాబాద్లోని మోర్, కాచిగూడ రిలయన్స్, కొండాపూర్ విజేత సూపర్ మార్కెట్, కేపీఎన్ ఫామ్, రత్నదీప్ సూపర్ మార్కెట్లో ఈ తనిఖీలు జరిగాయి. అలాగే కూకట్పల్లి సర్కిల్ వివేకానందనగర్ కాలనీలోని ఎకో సిరి మిల్లెట్ఫుడ్కోర్టులోనూ తనిఖీలు చేశారు. శుభ్రత పాటించకపోవడంతో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.