న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్త వెంచర్ల ప్రోత్సాహానికి ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్ (ఎఫ్ఎఫ్ఎస్) కోసం రూ.9,500 కోట్లు కేటాయించినట్లు సిడ్బీ చైర్మన్ ఎస్ రామన్ శుక్రవారం తెలిపారు. స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్కు అనుగుణంగా జనవరి 16, 2016న ఎఫ్ఎఫ్ఎఫ్ఎస్ను ప్రధానమంత్రి ఆవిష్కరించారు. సెబీలో రిజిస్టర్ అయిన వివిధ ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల (ఏఐఎఫ్లు)కి సహకారం కోసం ఇది రూ. 10 వేల కోట్ల కార్పస్ను ఆమోదించింది.
ఇన్నోవేషన్- ఆధారిత ఎంటర్ప్రైజెస్ అభివృద్ధి వృద్ధికి తోడ్పాటును అందించే లక్ష్యంతో ఏర్పాటైన ఎఫ్ఎఫ్ఎస్, సెబీ-రిజిస్టర్డ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల మూలధనంలో పాల్గొనడం ద్వారా స్టార్టప్లకు నిధుల అవసరాలను తీరుస్తుంది. ఎఫ్ఎఫ్ఎస్ వల్ల 100కు పైగా ఏఐఎఫ్లు రూ. 56,000 కోట్లు సమీకరించాయని రామన్ అన్నారు.