ఎయిర్​పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత

ఎయిర్​పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్​పోర్టులో శనివారం మధ్యాహ్నం భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళుతున్న ఓ వ్యక్తి వద్ద రూ.67,11,250 విలువ చేసే అమెరికెన్​డాలర్లు దొరికాయి. బ్యాగ్​అడుగు భాగాన కరెన్సీ నోట్లను అమర్చి, పైకి ప్లాస్టిక్​పేపర్​కనిపించేలా చేసి అడ్డంగా దొరికిపోయాడు. విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.