మందమర్రి ఏరియాలోని డంప్యార్డు భూముల పరిశీలన

మందమర్రి ఏరియాలోని డంప్యార్డు భూముల పరిశీలన

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్​ఓపెన్​కాస్ట్ విస్తరణలో భాగంగా ఫేజ్​2 మైన్ ​ఏర్పాటుకు అవసరమైన అటవీ భూమికి బదులుగా ఇవ్వాలని ప్రతిపాదించిన శ్రీరాంపూర్​ ఓసీపీ డంప్​యార్డు భూములను అటవీ, సింగరేణి ఉన్నతాధికారుల బృందం శుక్రవారం పరిశీలించింది. 

మంచిర్యాల డీఎఫ్​వో రాహుల్​కిషన్​జాదవ్, డివిజనల్​ఆఫీసర్​సర్వేశ్వర్, ఎఫ్​ఆర్​వో రత్నాకర్, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, ఎస్వోటుజీఎం జీఎల్ ప్రసాద్, డీజీఎం(సర్వే)దేశాయ్​ తదితరులు భూములను పరిశీలించారు. విస్తీర్ణం, మట్టి గుణాలు, నీటి లభ్యత అంశాలపై చర్చించారు.   ఆర్కేపీ ఓసీపీ మేనేజర్ ​పంకజ్,  ఆఫీసర్లు​ తదితరులు పాల్గొన్నారు.