అడవి బర్రె బతికిపోయింది పో

అడవి బర్రె బతికిపోయింది పో

ఓ నాలుగైదు సింహాలు.. ఓ అడవి బర్రెని వేటాడాయి. ఆవురావురంటూ తినేందుకు రెడీ అయ్యాయి. కానీ, ఇంతలో ఓ సివంగి (ఆడసింహం) వచ్చి ఇంకోదాన్ని గెలికింది. వాటి మధ్య గొడవ రాజుకుంది. దీంతో మిగతా సింహాలూ ఆ సివంగితో గొడవకు దిగాయి. కొట్లాడుకుంటూ కొట్లాడుకుంటూ వాటి తిండిని మరిచాయి. ఓ సింహం తమ వేట వద్ద కాపలా ఉన్నా, చివరకు అదీ గొడవలో కలిసిపోయింది. బతుకుజీవుడా అంటూ ఆ బర్రె అక్కడి నుంచి చిన్నగా జారుకుంది.

దక్షిణాఫ్రికాలోని క్రూగర్​ నేషనల్​ పార్క్​లో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియోను ఇండియన్​ ఫారెస్ట్​ సర్వీసెస్​ అధికారి పర్వీన్​ కశ్వాన్​ ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. ఈ సింహాలన్నీ మనకో పాఠాన్ని నేర్పాయంటూ కామెంట్​ పెట్టారు. ‘‘వాటికి తింటున్నప్పుడే గొడవ గుర్తొచ్చిందేమో. ఈ సింహాలు తిండిని వదిలేసి గొడవ పెట్టుకోవడంతో, ఆ బర్రె తీరిగ్గా వెళ్లిపోయింది” అని ట్వీట్​ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్​ అయింది.