ఓ నాలుగైదు సింహాలు.. ఓ అడవి బర్రెని వేటాడాయి. ఆవురావురంటూ తినేందుకు రెడీ అయ్యాయి. కానీ, ఇంతలో ఓ సివంగి (ఆడసింహం) వచ్చి ఇంకోదాన్ని గెలికింది. వాటి మధ్య గొడవ రాజుకుంది. దీంతో మిగతా సింహాలూ ఆ సివంగితో గొడవకు దిగాయి. కొట్లాడుకుంటూ కొట్లాడుకుంటూ వాటి తిండిని మరిచాయి. ఓ సింహం తమ వేట వద్ద కాపలా ఉన్నా, చివరకు అదీ గొడవలో కలిసిపోయింది. బతుకుజీవుడా అంటూ ఆ బర్రె అక్కడి నుంచి చిన్నగా జారుకుంది.
దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్లో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి పర్వీన్ కశ్వాన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ సింహాలన్నీ మనకో పాఠాన్ని నేర్పాయంటూ కామెంట్ పెట్టారు. ‘‘వాటికి తింటున్నప్పుడే గొడవ గుర్తొచ్చిందేమో. ఈ సింహాలు తిండిని వదిలేసి గొడవ పెట్టుకోవడంతో, ఆ బర్రె తీరిగ్గా వెళ్లిపోయింది” అని ట్వీట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది.