కల్యాణలక్ష్మి డబ్బుల కోసం జీపీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ

కల్యాణలక్ష్మి డబ్బుల కోసం జీపీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ

జీపీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ 

ఆర్ఐ విచారణలో వెల్లడి

లింగంపేట, వెలుగు: కల్యాణలక్ష్మి డబ్బులకు కక్కుర్తిపడ్డ ఓ వ్యక్తి జీపీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. మండలంలోని పర్మల్లలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విచారణ జరపగా సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు బయటపడిందని ఆర్ఐ బాలయ్య చెప్పారు. గ్రామానికి చెందిన రావుల శ్రీనివాస్​గతేడాది జూలైలో తన కూతురు పెండ్లి చేశాడు. కల్యాణలక్ష్మి ఫైల్​పై సంతకం చేయాలని సెప్టెంబర్​లో జీపీ సెక్రటరీ శ్వేత వద్దకు వెళ్లాడు.పెండ్లి కూతురు మైనర్​ కావడంతో సంతకం చేయనని ఆమె తేల్చి చెప్పారు. శ్రీనివాస్​ గ్రామానికి చెందిన మరికొందరి సాయంతో సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి, మిగతా సర్టిఫికెట్లను జత చేసి ఫైల్​రెడీ చేశాడు. గెజిటెడ్​సంతకం కోసం ఎంపీడీవో వద్దకు వెళ్లగా, ఆయన పరిశీలించకుండానే సంతకాలు చేశాడు.ఆ ఫైల్​ను రెవెన్యూ ఆఫీస్​లో అందజేయగా ఆర్ఐ విచారణ చేశారు. జీపీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. రావుల శ్రీనివాస్, అతడికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్​ సుధాకర్, ఎంపీడీవో మల్లికార్జున్​రెడ్డి, ఎంపీవో ప్రభాకర్​చారిలకు జీపీ సెక్రటరీ శ్వేత కంప్లైంట్​చేశారు.