జేపీఎస్​ల పనితీరుపై కమిటీలు వేయండి

జేపీఎస్​ల పనితీరుపై కమిటీలు వేయండి

కలెక్టర్లకు పీఆర్  డైరెక్టర్  ఆదేశం
హైదరాబాద్, వెలుగు: జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్)ల పనితీరును అంచనా వేసేందుకు జిల్లా స్థాయి పెర్ఫార్మెన్స్  ఎవాల్యుయేషన్  కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను పీఆర్  డైరెక్టర్  హనుమంతరావు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్లు జారీచేశారు. ఇప్పటికే  జేపీఎస్​ల  పనితీరును లెక్క కట్టడానికి గైడ్ లైన్స్ ఇచ్చామని, ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జేపీఎస్​ల పనితీరును అంచనా వేయడానికి అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), ఎస్పీ లేదా డీఎస్పీ స్థాయి అధికారి, డిస్ట్రిక్  ఫారెస్ట్ ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని ఇటీవల ఆదేశించారు. 8 అంశాలకు 100 మార్కులు ఇచ్చి, మరో 60 అంశాల ఫార్మాట్​ను నింపి అధికారులకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

ALSO READ:ఆర్టీసీ పల్లెవెలుగు టౌన్ బస్పాస్​ఆఫర్​