సిరాజ్‌‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు

సిరాజ్‌‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు

న్యూఢిల్లీ: గతేడాది బోర్డర్‌‌–గావస్కర్‌‌ ట్రోఫీ సందర్భంగా జరిగిన ఓ సంఘటనలో టీమిం డియా పేసర్‌‌ మహ్మద్‌‌ సిరాజ్‌‌ కన్నీటి పర్యంతమయ్యాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌‌ టిమ్‌‌ పైన్​ అన్నాడు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న సిరాజ్​పై సిడ్నీ టెస్టులో తమ అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేయాల్సింది కాదన్నాడు. ‘సాధారణంగా ఆసీస్‌‌కు వచ్చే విదేశీ జట్లకు మేం చాలా బాగా ఆతిథ్యం ఇస్తాం. కానీ సిరాజ్‌‌పై మా ఫ్యాన్స్​  జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు విన్న సిరాజ్‌‌ అంపైర్ల దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశాడు. అప్పటికే అతని కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ మాటలు చాలా బాధించాయనుకుంటా. మాకే ఇబ్బందిగా అనిపించింది. ఒకవేళ ఇండియా సిరీస్‌‌ను రద్దు చేసుకుందామని ప్రతిపాదిస్తే ఒప్పుకునే వాళ్లం. కానీ అలా జరగకుండా ఈ వ్యవహారాన్ని ఇండియా బాగా హ్యాండిల్‌‌ చేసింది’ అని పైన్​ పేర్కొన్నాడు.