చెన్నై మాజీ మేయర్ సైదై దురైసామి కుమారుడు వెట్రి దురైసామి ప్రయాణిస్తున్న కారు హిమాచల్ ప్రదేశ్ లోని సట్లెజ్ నదిలో పడిపోయింది. కషాంగ్ నాలా ఎన్ హెచ్ 05 వద్ద పిక్నిక్ స్పాట్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. 2024 ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం రోజున వెట్రి దురైసామి (45) గోపీనాథ్తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనలో హిమాచల్ ప్రదేశ్లోని టాబో నివాసి టెన్జిన్ వాహనం నడుపుతున్నాడు. దురైస్వామి, గోపీనాథ్లు స్పితి వ్యాలీ నుంచి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లింది. కారు డ్రైవర్ టెన్జిన్ మృతి చెందాడు. గోపీనాథ్ను అధికారులు రక్షించగా.. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.
ALSO READ :- నోట్ దిస్ : 2024లో రైల్వే ఉద్యోగాల నోటిఫికేషన్ తేదీలు ఇవే
ఈ ప్రమాదంలో టెన్జిన్ మృతి చెందగా, దురైసామి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వెట్రి దురైసామి నదిలో కొట్టుకుపోయాడని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు.