మాజీ సీఎం రోశయ్య సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ రాహుల్రాజ్

మాజీ సీఎం రోశయ్య సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ రాహుల్రాజ్
  •     మెదక్​ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో మాజీ సీఎం రోశయ్య జయంతి

మెదక్​ టౌన్​, వెలుగు: ప్రజా ప్రతినిధిగా కొణిజేటి రోశయ్య సేవలు మరువలేనివని మెదక్​ కలెక్టర్​ రాహుల్​రాజ్​అన్నారు. ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కలెక్టరేట్​లో జిల్లా యువజన క్రీడలు శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని రోశయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

కార్యక్రమాల్లో జిల్లా అడిషనల్​కలెక్టర్​ నగేష్​, డీఆర్​వో భుజంగ రావు, డీయూఎస్​వో  దామోదర్ రెడ్డి, మెదక్​ ఏఎస్పీ మహేందర్​ సైబర్​ క్రైమ్​ డీఎస్పీ సుభాష్​ చంద్రబోస్​, ఏఆర్​ డీఎస్పీ రంగనాయక్​, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామచంద్రాపురం, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు రామచంద్రాపురం రెవెన్యూ అధికారులు శుక్రవారం ఘన నివాళ్లు అర్పించారు. 

రోశయ్య 92 వ జయంతిని పురస్కరించుకొని తహసీల్దార్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్​ సంగ్రామ్​రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర అభివృద్ధి కోసం దివంగత సీఎం రోశయ్య చేసిన కృషి మరవలేనిదని అన్నారు. రెవెన్యూ సిబ్బంది లక్ష్మీ శ్వేత, విజయ, వినీత్​, స్వప్న, శ్వేత, శ్రీకాంత్​, రాములు, సంజీవ  పాల్గొన్నారు.