అభివృద్ధిని చూసే బీఆర్ఎస్​లో చేరుతున్నారు : షకీల్ ఆమేర్

అభివృద్ధిని చూసే బీఆర్ఎస్​లో చేరుతున్నారు : షకీల్ ఆమేర్

బోధన్, వెలుగు: బోధన్​ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని కాంగ్రెస్, బీజేపీ లీడర్లు బీఆర్ఎస్​లో చేరుతున్నారని ఎమ్మెల్యే షకీల్ ఆమేర్​ పేర్కొన్నారు. బుధవారం బోధన్​లోని ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్​పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్​రావు, శేఖర్, సీనియర్​ లీడర్లు రాంబాబు బీఆర్ఎస్​లో చేరారు. వారికి షకీల్​ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. షకీల్​ మాట్లాడుతూ..బోధన్ లోని శక్కర్​నగర్​లో త్వరలో నియోజకవర్గంలోని యువ నాయకులతో యువగర్జన సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్​ఎస్​టౌన్​ప్రెసిడెంట్​రవీంద్ర యాదవ్, బీఆర్ఎస్​ లీడర్లు పాల్గొన్నారు.

Also Read ; అన్నదాతే కాదు.. ప్రాణదాత కూడా: 61 ఏళ్ల రైతు.. కిడ్నీలు, లివర్, కళ్లు దానం