హెచ్‎సీఏ మెంటార్‎గా మాజీ క్రికెటర్ వసీం జాఫర్

హెచ్‎సీఏ మెంటార్‎గా మాజీ క్రికెటర్ వసీం జాఫర్

ఉప్పల్, వెలుగు: హైదరాబాద్​క్రికెట్​అసోసియేషన్​(హెచ్​సీఏ) మెంటార్‌‌గా మాజీ క్రికెటర్​వసీం జాఫర్‎ను నియమించింది. హెచ్​సీఏ సెక్రటరి జీవన్​ రెడ్డి, ఆపరేషన్​హెడ్​అంబటి రాయుడు సోమవారం ఉప్పల్​ క్రికెట్​స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్‎లో వివరాలు వెల్లడించారు. 2 సంవత్సరాల కాంట్రాక్ట్​తో జాఫర్​సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. 

ప్లేయర్లు, కోచ్‎లకు మార్గనిర్ధేశనం చేయడంతో పాటు తెలంగాణలో డిస్ట్రిక్ట్​ లెవెల్​క్రికెట్​అభివృద్దికి కొత్త ప్రణాళికలు చేపడుతున్నట్లు హెచ్​సీఏ వెల్లడించింది. పలు జిల్లాల్లో క్రికెట్ అకాడమీలు, బీసీసీఐ నామ్స్‌‌తో  సూర్యాపేట, జగిత్యాల, నాగర్​కర్నూల్​, సిద్ధిపేట్‌‌లో సెంటర్ ఆఫ్​ఎక్సలెన్స్​లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.  

రాబోయే  సీజన్​ నుంచి ఇనిస్టిట్యూషన్​ టీమ్‌‌లను ఏ, బీ, సీ డివిజన్లుగా విభజించనున్నట్లు చెప్పారు. దీంతో దాదాపు 600 మంది కొత్త ప్లేయర్లకు లీగ్​ వ్యవస్థలోకి వచ్చే అవకాశం కలుగుతుందన్నారు. జులై 12న జరిగే టీజీ 20 ఫైనల్​ మ్యాచ్​కు సీఎం, గవర్నర్​లను ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.