కేసీఆర్​కు మాజీ గవర్నర్ నరసింహన్ ​పరామర్శ

కేసీఆర్​కు మాజీ గవర్నర్ నరసింహన్ ​పరామర్శ

హైదరాబాద్, వెలుగు: తుంటి మార్పిడి చికిత్స చేయించుకున్న మాజీ సీఎం కేసీఆర్​ను మాజీ గవర్నర్​ ఈఎస్ఎల్ ​నరసింహన్ ​పరామర్శించారు. ఆదివారం నందినగర్​లోని కేసీఆర్​ నివాసానికి చేరుకున్న నరసింహన్ ​దంపతులకు బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్​ దంపతులతో నరసింహన్ దంపతులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేసీఆర్​ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నరసింహన్​ దంపతులను కేసీఆర్​దంపతులు సత్కరించి పట్టువస్త్రాలు అందజేశారు. తెలంగాణ గవర్నర్​గా తనకు అప్పటి ప్రభుత్వం ఎంతో సహకరించిందని నరసింహన్​ గుర్తు చేసుకున్నారు. ఈ భేటీలో ప్రశాంత్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్, కొప్పుల ఈశ్వర్, సంతోష్ ​కుమార్, బీబీ పాటిల్​తదితరులు పాల్గొన్నారు. 

అజ్మీర్​ దర్గాకు చాదర్​..

అజ్మీర్ దర్గాకు బీఆర్ఎస్​ చీఫ్​ కేసీఆర్ ​చాదర్​పంపించారు. ఏటా ఉర్సు షరీఫ్ ​సందర్భంగా అజ్మీర్​ దర్గాకు కేసీఆర్​ చాదర్ ​సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ముస్లిం మత పెద్దలతో చాదర్​ను పంపారు. మాజీ హోం మంత్రి మహమూద్ ​అలీ, నాయకుడు ఆజం అలీ, ముస్లిం మత పెద్దల సమక్షంలో ఆదివారం తన నివాసంలో కేసీఆర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.