
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ, ముంబై జట్ల మధ్య రంజీ మ్యాచ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్టేడియంలోని ఓ పెవిలియన్కు విరాట్ కోహ్లీ పేరు పెట్టాలని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది.
క్రికెట్ స్టేడియంలో చాలా మంది మాజీ ఆటగాళ్ల పేర్లతో పెవీలియన్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్ పేరు మీద పెవీలియన్లు పెట్టిన సందర్భాలు చాలా తక్కువ. అటు ఢిల్లీలోని స్టేడియంలో ఓ పెవీలియన్ కు విరాట్ కోహ్లీ పేరు పెట్టడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.