క్రికెటర్ లక్ష్మణ్ ను రౌండ్ అప్ చేసిన సెల్ఫీల గుంపు

క్రికెటర్ లక్ష్మణ్ ను రౌండ్ అప్ చేసిన సెల్ఫీల గుంపు

క్రికెటర్లకు, సిన్మా యాక్టర్లకు,  రాజకీయనాయకులకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బయట ఎక్కడ కనిపించినా వాళ్లతో ఫోటోలు,సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్తనే ఉంటరు. సర్ ఒక్క సెల్ఫీ అంటూ వాళ్ల వెంట బడ్తరు. అభిమాన  ఫోటోలు దిగేవరకు పోటీపడ్తరు.

ఇయ్యాల తిరుమలకు వచ్చిన మన హైదరాబాదీ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కు ఇదే పరిస్థితి ఎదురైంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత  లక్ష్మణ్  తో సెల్ఫీల కోసం అక్కడికి వచ్చిన భక్తులు ఎగబడ్డరు. సార్ సార్ అంటూ సెల్ఫీల కోసం ఆయనను రౌండప్ చేసిన్రు. అయినా ఏ మాత్రం కోప్పడకుండా లక్ష్మణ్ ఓపికతోనే  చాలా మందికి సెల్పీలు ఇచ్చిండు. దీంతో అభిమానులు తెగ ఖుషి అయ్యిండ్రు.