అందరమొకటై కేసీఆర్​ను దింపేస్తాం : షబ్బీర్​అలీ

అందరమొకటై కేసీఆర్​ను దింపేస్తాం : షబ్బీర్​అలీ
  • మాజీ మంత్రి షబ్బీర్​అలీ
     

కామారెడ్డి, వెలుగు : కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అన్ని శక్తులు ఏకమవుతున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్​నేత షబ్బీర్​అలీ పేర్కొన్నారు. కామారెడ్డి మండలం ఉగ్రవాయికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు యువకులు సోమవారం షబ్బీర్​అలీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఈ సందర్భంగా షబ్బీర్​అలీ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణంలో దేశంలోనే  అతిపెద్ద స్కామ్​ జరిగిందని ఆరోపించారు.

దీనిపై ఎన్ని నివేదికలు పంపినా,  ఎంక్వైరీ చేయడం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్​ ఒకటేనన్నారు. అవినీతి రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు యువకులు సైనికుల్లా పని చేయాలని కోరారు. డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​శ్రీనివాస్​రావు, పార్టీ మండలాధ్యక్షుడు గూడెం శ్రీనివాస్​రెడ్డి,   కౌన్సిలర్​ పాత శివకృష్ణమూర్తి, లీడర్లు పంపరి లక్ష్మణ్, సందీప్ పాల్గొన్నారు.