మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేస్త : మల్లారెడ్డి

మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేస్త : మల్లారెడ్డి

హైదరాబాద్, వెలుగు :  పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్​సభ స్థానం నుంచి పోటీ చేస్తానని బీఆర్ఎస్ నేత,  మాజీ మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్​లో పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్​ను కలిశారు.

 తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం మీడియాతో ఆయన చిట్​చాట్​చేశారు. మల్కాజిగిరి లోక్​సభ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ గెలిచిందని తెలిపారు. 2014లో మల్కాజిగిరి నుంచి తాను ఎంపీగా గెలిచానని, పార్టీ ఇప్పుడు అవకాశమిస్తే పోటీకి సిద్ధంగా ఉన్నానని మల్లారెడ్డి పేర్కొన్నారు.