కవిత ప్రజలను మోసం చేస్తున్నారు : సుదర్శన్​ రెడ్డి

కవిత ప్రజలను మోసం చేస్తున్నారు : సుదర్శన్​ రెడ్డి

బోధన్​,వెలుగు: బతుకమ్మలో పువ్వులు పెట్టినట్లు అందరి చెవిలో పువ్వులుపెట్టి  ప్రజలను ఎమ్మెల్సీ కవిత  మోసం చేస్తున్నారని మాజీ  మంత్రి  పి.సుదర్శన్​ రెడ్డి  విమర్శించారు. మంగళవారం మండలంలోని రాజీవ్​ నగర్​తండా, ఊట్​పల్లి, అమ్దాపూర్,  బెల్లాల్, ఏరాజ్​పల్లి  గ్రామాల్లో కాంగ్రెస్​ నాయకులతో కలసి ప్రచారం నిర్వహించారు. ఊట్​పల్లిలో ఆయన మాట్లడుతూ ఎన్ఎస్ఎఫ్​ భూములు తన హయంలోనే ఇప్పించానని నేటికి ఆ భూములకు పట్టాలు ఇవ్వలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే అందరికీ పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే షకీల్ దోచుకోవడం తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదని  విమర్శించారు.  కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ  స్కీమ్​లను అమలు చేస్తామన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్​ చైర్​ పర్సన్​ తూము పద్మావతి,  ఎల్లయ్య, నాగేశ్వర్​రావ్​,  తలారీ నవీన్,నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.