కాళేశ్వరం ప్రాజెక్టును నేను తప్పుపట్టలే: పొన్నాల

కాళేశ్వరం ప్రాజెక్టును నేను తప్పుపట్టలే: పొన్నాల

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టును తానెప్పుడూ తప్పుబట్టలేదని, ప్రాజెక్టుకు పెడుతున్న ఖర్చుపైనే అభ్యంతరం తెలిపానని మాజీ మంత్రి, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, కేసీఆర్ చేసిన అప్పుల గురించి రాష్ట్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కరెక్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌లో నిర్ణయాలు తీసుకోని, ప్రజలకు నీళ్లిచ్చే స్థితిలో లేని వ్యక్తులు.. కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో ప్రాజెక్టుల గురించి చర్చపెడితే మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి పారిపోయారని గుర్తుచేశారు. మేడగడ్డ బ్యారేజీలో సమస్య ఉంటే, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నుంచి నీళ్లు ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు. వట్టి మాటలు కట్టిపెట్టి, ప్రజలకు నీళ్లిచ్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.