హెల్త్ సెంటర్ లో రోగులకు పండ్లు పంపిణీ : నరేందర్​రెడ్డి

హెల్త్ సెంటర్ లో రోగులకు పండ్లు పంపిణీ : నరేందర్​రెడ్డి

కొడంగల్, వెలుగు: గత ప్రభుత్వ పథకాలను అమలు చేస్తే చాలని మాజీ ఎమ్మెల్యే నరేందర్​రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కొడంగల్​కమ్యూనిటీ హెల్త్​సెంటర్​లో రోగులకు పండ్లు పంపిణీ చేసి మాట్లాడారు. అధికారం కోసం కాంగ్రెస్​సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టిందన్నారు. మహబూబ్​నగర్​ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునట్లే లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్​ కైవసం చేసుకుంటుందన్నారు. కార్యక్రమంలో నేతలు విష్ణువర్ధన్​రెడ్డి, సలీం, నారాయణరెడ్డి, భీములు, మధుసూదన్​రావు, మహిపాల్​రెడ్డి, చాంద్​పాష, రఘుపతిరెడ్డి పాల్గొన్నారు.