బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం : ఏపీ జితేందర్​రెడ్డి

బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం : ఏపీ జితేందర్​రెడ్డి

మక్తల్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం నామినేషన్ల సందర్భంగా ఆ పార్టీ మక్తల్​ అభ్యర్థి​జలంధర్​రెడ్డికి మద్దతుగా నామినేషన్​ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కన్యకా పరమేశ్వరి టెంపుల్​ నుంచి బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ  నిర్వహించారు. 

అనంతరం జలంధర్​ నామినేషన్  పత్రాలను దాఖలు చేశారు. ఈ సంందర్భంగా జలంధర్​రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పారు. ఆదివారం నుంచి పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తామన్నారు. 

మక్తల్  గడ్డపై జలంధర్​రెడ్డి గెలవడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కొండయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో కర్నే స్వామి, బలరాం రెడ్డి, భాస్కర్, నర్సింహారెడ్డి, రాజశేఖర్​ రెడ్డి, సోమశేఖర్​గౌడ్​, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్, మంజునాథ్​ పాల్గొన్నారు.