వారంటీ లేని గ్యారెంటీలతో ప్రజలను ఆగం చేశారు : బోయినపల్లి వినోద్​కుమార్

వారంటీ లేని గ్యారెంటీలతో ప్రజలను ఆగం చేశారు : బోయినపల్లి వినోద్​కుమార్

గంగాధర, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ వారంటీ లేని గ్యారెంటీల పేరు చెప్పి ప్రజలను ఆగం చేసిందని, కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేశారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్​కుమార్ అన్నారు. గత పదేళ్లలో కేసీఆర్​ తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారన్నారు.

శనివారం గంగాధర మండలం మధురానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ ఫంక్షన్‌‌‌‌‌‌‌‌హాల్‌‌‌‌‌‌‌‌లో చొప్పదండి నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవిశంకర్, కె.విద్యాసాగర్​రావు, పార్టీ నేత గెల్లు  శ్రీనివాస్​యాదవ్​హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్​7 వేల స్టాఫ్​నర్సు ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తే సీఎం రేవంత్​రెడ్డి నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చామంటున్నారని మండిపడ్డారు.

ఫిబ్రవరి నెలాఖరుకల్లా 2 లక్షల ఉద్యోగ ఖాళీల వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్​ చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ  అభివృద్ధికి బండి సంజయ్ నయాపైసా తీసుకురాలేదని దుయ్యబట్టారు.