
హైదరాబాద్, వెలుగు: ప్రసార భారతి మాజీ సీఈవో, రిటైర్డ్ ఐఏఎస్కంభంపాటి సుబ్రహ్మణ్య శర్మ (80) అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు.శనివారం హైదరాబాద్ లో ఆయన కన్నుమూశారు. కేఎస్ శర్మకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్అధికారి అయిన కేఎస్శర్మ దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ గా, ఆ తర్వాత ప్రసార భారతి సీఈఓగా 2006 వరకు సేవలు అందించారు.
దూరదర్శన్.. డైరెక్ట్ టు హోమ్, డీడీ డైరెక్ట్ ప్లస్ లాంటి సేవలను చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు. అప్పటి కరీంనగర్ కలెక్టర్ గా కూడా పనిచేశారు. కేఎస్శర్మ అంత్యక్రియలను సోమవారం నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రసార భారతి సీఈఓ, వెంకటేశ్వర భక్తి చానల్ వ్యవస్థాపక సీఈఓ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కార్యాలయంలో ముఖ్య అధికారిగా, కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిగా ఆయన సేవలు అందించారు.