ఇప్పటి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం రావడం కష్టమన్నారు మాజీ ప్రధాని దేవెగౌడ. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని చెప్పారు. అన్ని పార్టీలు కలవాలంటే కామన్ అజెండా కావాలన్నారు. ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా కేంద్రంలో ఓ జాతీయ పార్టీ అధికారంలోకి రావడం కూడా కొంత కష్టమే అన్నారు దేవెగౌడ. ఏడేళ్ల మోడీ ప్రభుత్వంలో దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని తెలిపారు. ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు దేవెగౌడ.