బీజేపీ, కాంగ్రెసేతర  ప్రభుత్వం  రావడం కష్టం

బీజేపీ, కాంగ్రెసేతర  ప్రభుత్వం  రావడం కష్టం

ఇప్పటి  పరిస్థితుల్లో   కేంద్రంలో బీజేపీ,  కాంగ్రెసేతర  ప్రభుత్వం  రావడం కష్టమన్నారు మాజీ ప్రధాని  దేవెగౌడ. రాష్ట్రాల్లో   ప్రాంతీయ పార్టీలు  బలంగా ఉన్నాయని  చెప్పారు. అన్ని పార్టీలు కలవాలంటే   కామన్ అజెండా  కావాలన్నారు. ప్రాంతీయ పార్టీల  సహకారం లేకుండా  కేంద్రంలో ఓ జాతీయ  పార్టీ అధికారంలోకి  రావడం కూడా  కొంత కష్టమే  అన్నారు దేవెగౌడ.  ఏడేళ్ల మోడీ ప్రభుత్వంలో  దేశం ఎన్నో  సమస్యలను  ఎదుర్కొంటోందని  తెలిపారు. ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో  కలిసి దర్శించుకున్నారు దేవెగౌడ.